
జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం రేంజ్ లో శుక్రవారం ట్రైనీ ఐఏఎస్ లు పర్యటించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలకు చెందిన సాలోని చాబ్రా, సౌరభ్ శర్మ, ప్రణయ్ కుమార్, చింగ్ తియెన్ మావి, హరీశ్చౌదరి జంగల్ సఫారీ వాహనంలో గొండుగూడ, బైసన్ కుంటను సందర్శించారు. అడవులు, వన్యప్రాణుల రక్షణతోపాటు అడవుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఫారెస్ట్ ఆఫీసర్లు వారికి వివరించారు.